03 October, 2021

 

నేస్తం

 

నా హైదరాబాద్ ట్రిప్పు వారం పూర్తి అయింది . ఆ రాత్రికే బొంబాయి వెళ్ళడానికి దొరంతోకి రిజర్వ్చేయించుకున్నాను.రాత్రి పదకొండు దాటాకే ట్రైను.మా మరిది వచ్చి, స్టేషనుకి దిగబెట్టేడు.  అప్పటికి ఇ కా తొమ్మిదయింది.తనని ఇంటికి వెళ్ళిపోమన్నాను.

ట్రైన్ టైమిం గ్ చూ సుకుంటున్నాను ,నా పక్కనే నేసం అన్న్ పిలుపు వినిపించింది. ఈలొగా   నా ట్రైను రెం డు గంటలు లే టుగా బయలుదేరు "తుందని అనౌన్స్మెంటు వినిపించింది.

నేస్తం గుర్తు పట్టలేదా> నేను స్వర్నలతని అదే మా ఇంట్లో రాణి అని పిలిచేవారు, హిరమండలం మర్చిపోయావా నేస్తం?"

 "ఆ! ఆ! గుర్తొచ్చింది మీ నాన్నగారు గురుమూర్తిగారు,ఇరిగేషను డిపార్ట్మెంటులో పనిచేసేవారు. మీ అమ్మగారు ,మీ నాయనమ్మగరు వుండేవారు."

అనగానే నా రెండు చేతులు పట్టుకుని "ఎన్ని సంవత్సరాలయింది నేస్తం మళ్ళీ నిన్ను చూడగలననుకోలేదు." కళ్ళలోసన్నటి నీటి పొర.నిజమే ఇలా కలుసుకోవడం యాధృచ్చికమే,నువ్వెటు ప్రయాణం?"

"రాజమండ్రి ఇక్కడ మా ఆడబిడ్డ గృహ ప్రవేశానికి  వచ్చేను.పనైపోయింది వెళ్తున్నాను. నా ట్రైనుకి గంటపైనే సమయం వుంది. తన రెండు చేతులు పట్టుకుని "నేస్తం! అమ్మ నాన్నగారు నాయనమ్మ ఎలా వున్నారు?"

ప్రశ్న పూర్తికాకుండానే బల్లిలా నన్ను కరుచుకుని "అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు?అవాక్కయాను."అదెలా ? ఎప్పుడు?" తన రెడు కళ్ళూ జలపాతాల్లా వర్షిస్తున్నాయి  "నేస్తం శాంతపడు నీ రైలుకి టైముంది . బెంచ్ మీద కూర్చుని వివరంగా మాట్లాడుకుందామ్న్ పద." అంటూ బెంచ్ మీద కూర్చోపెట్టి నీళ్ళ బాటిలు యిచ్చాను"కాస్త తాగి మొఖం కడుక్కుని తెప్పరిల్లు."

కాస్త శాంతపడి"మీరు ఆవూరినించి వెళ్ళి పోయాక ఇంకెవరూనాకు స్నేతురాళ్ళు దొరకలేదు.అలా అనేకన్నా నేనే ఎవరితో స్నేహం చేయలేదు.పదవ తరగతికి వచ్చాను,రెండు నెలలు గడిచాయో లేదో నాన్నగారికి హార్త్ అట్టాక్ వచ్చింది, హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే సమయం కూడా యివ్వ లేదు,వెళ్ళిపొయేరు.

 మా ముగ్గుకి లోకం అంతా చీకటీయినట్లయింది.మామయ్య వచ్చి అండగా నిలబడ్డాడు.నాన్న తరఫున నాయనమ్మ తప్ప యింకెవరూ లేరు.ఆఫీసువాళ్ళు స్నేహితులే చూసుకున్నారు.అమ్మని పట్టుకుని మామయ్య గోల పెట్టేడు,"బావగారు పిల్ల కోసం ఎమీ నిర్వాకం చెయ్యలేదు యిల్లు గాని జాగాలు గాని ఏమీ కూర్చుకోలేదు.యీపిల్లని ఎలా ఒడ్డు చేరుస్తాం అక్కా?" అంటూ ఏడ్చాడు.

 అమ్మ నిశ్శబ్దం అయిపోయింది ఏడవదు మాట్లాడదు" .

రాణి మనసులోని బాధనంతా చెప్పుకోనిచ్చాని.

"రెండు నెలలు గడిచాయి నాయనమ్మ కూడా నాన్న దారే పట్టుకుంది.

మామయ్య మళ్ళీ వచ్చాదు,"యిక లాబం లేదు,రాణి పదో తరగాతి పరీక్షలవగానే మా యిద్దరినీ రాజమండ్రి తీసుకెళిపోతాను అందరం ఒక్కచోటే వుందాం అన్నాడు. మీ యిద్దరికి యింత పెద్ద మేద ఎందుకు అంటూ ఒక గది వంటిల్లు వున్న యిల్లు చూశాడు.అఖరలెని సామాన్లన్నీ  అమ్మేశాడు నా పరీక్షలైన ఉత్తర క్షణం మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళిపోయాడు. నాకున్న నగలలో ఏవి కావాలో వుంచి ,నాయనమ్మనగలు అమ్మ నగలు అన్నీ అమ్మేసి ఫిక్సిడ్ డిపాజిట్లు చేశాడు.దేనికీ అమ్మ అడ్డు చెప్పలేదు.

నన్ను ఇంటర్లో జాయిన్ చేశాడు.కాలేజి ఇంటికి దగ్గరే.    అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.ఇంటరు మొదటి సంవత్సరం పూర్తయింది.రెండో సంవత్సరం లోకి అడుగు పెట్టాను.ఎప్పుడూ నాన్నే కళ్ళలో మెదిలేవారు.  ఒకరోజు కాలేజి నుంచి వచ్చే సరికి అమ్మ  ఏ సింటంస్ లేకుండా చెయ్యి జారి పోయింది.మా అత్త చాలా మంచిది.నన్ను పట్టుకుని అమ్మ కన్న ఎక్కువగా ఓదార్చింది.భగవంతుడు నా మీద పగ తీర్చుకుంటున్నాడులా వుంది.యింత ఘోరంగా ఎవరి జీవితం లోనైనా జరిగిందా?"

రెండు చేతుల మధ్య  ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది .

"నేస్తం ధైర్యం తెచ్చుకో యింకేమయిందో చెప్పు." ఊపిరి గట్టిగా పీల్చుకొని చెప్పడం మొదలు పెట్టింది."ఇంటరు పూర్తవగానే మామయ్య ఒక సంబంధం తెచ్చాడు.అబ్బాయిది రాజమండ్రియే,తండ్రి అతని నాలుగో ఏట పోయారుట తల్లి గత సంవత్సరమే పోయారుట.ఒక అక్క యిక్కడ వున్నామె. అతని జాతకం కూడా నా లాగే వుంది.  "పెళ్ళికి తొందరేముంది మామయ్యా డిగ్రీ చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అతనెటువంటి వాడో  నేను అద్జస్ట్ అవగలనా?" అంటూ సందేహం బయట పెట్టాను."చూడు రాణీ! నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే నేను అంత వరకు వుంటానన్నభరోసా ఏముంది ఏది ఏమైనా ?తొందరగా పనులు ముగించుకోవాలి."

నేను ఏమీ మాట్లాడలేదు మా పెళ్ళి నిరాడమరంగా జరిగిపోయింది.అబ్బాయి పేరు వెంకట రమణమూర్తి కాస్త అమాయకంగా వుంటాడు"మరి ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా అదీ లేదా?ఆతృతగా అడిగాను.

"చేస్తున్నాడమ్మా మధ్య మధ్యలో బ్రేకువుంటుంది."

"అలాంటప్పుడు భుక్తి ఎలా?"

 

"అరే! చింత పడకు అతనికి తాతల నాటి యిల్లు వుంది,క్రింది వాటాలో మేము వుంటే పై వాటా బేంకువాళ్ళకి అద్దెకు యిచ్చాము, మొదటి తారీకు వచ్చేసరికి పదివేల రూపాయలుచేతిలో పెడతారు. అది చాలు బ్రతకడానికి."

అంతా విన్నాక "యింక నీకేం యిబ్బంది నేస్తం?బాగానే వుందిగా."

"అయ్యో అతనికి ఫ్యూచరు ప్లాను లేదు,మాటా మంతీ లేదు అన్నింటికి నిరాసక్తత.అటువంటి వ్యక్తితో పది సంవత్సరాలై నెట్టుకొస్తున్నాను.నేను చిన్నా చితకా వుద్యోగానికి ప్రయత్నిస్తానంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి వుద్యోగం చెయ్యడం నచ్చదంటాడు.నేనెలా పెరిగానో నీకు తెలుసు కదా.మంచి సలహాయివ్వడానికి కూడా ఎవ్వరూ మిగల లేదు." అంటూ బాధ పడుతుంటే వీపు నిమురుతూ " మీ నాన్న గారికి నువ్వంటే ప్రాణం మేము చూస్తున్న సమయం లో నే నీ కోసం బంగారు నగలు తెచ్చే వారు.అతనికి జీతం బాగానే వచ్చేది.అతని కాగితాలన్నీ మరొక సారి క్షుణ్ణంగా వెతుకు ఏమైనా దొరక వచ్చు.వున్న అమౌంట్ లోంచి యింటివద్దే డైలీ నీడ్స్ లాంటి చిన్న షాపు పెట్టించు. వుద్యోగం కొన్నాళ్ళుచేసి మానేసి చేస్తుంటే డబ్బులు అందరూ సరిగా యివ్వరు ,అలాంటప్పుడు మనిషి నిస్పృహకి లోనవుతాడు.ఎవరో నీకు ఆసరా అవుతారని ఆశ పెట్టుకోకు, నువ్వే మీ ఆయనకి ఆసరాగా నిలబడి ప్రోత్సహించు   అతని యింట్రస్ట్ ఏమిటో తెలుసుకుని ఆ దిశగా చెయ్యడం మంచిది  నీ ఫొన్ నంబరు యివ్వు ప్రతి వారం నీకు ఫోను చేస్తాని. నీ కన్నా బలహీనులు అధమ పరిస్తితిల్లోవున్న వాళ్ళు ఎలాగో ఒకలాగ నిలదొక్కు కుంటున్నారు.నువ్వు పెరిగిన వాతావరణం నీకు చేసిన గారాబంవల్ల నువ్విలా ఫీలవుతున్నావు.నీ చిన్నప్పుడు నీ కోసం స్నేహితుల్ని కూడా అంకల్ వెతికి పెట్టే వారు అలాంటి వాళ్ళలో నేనొకర్తిని. ఇలా నిరాశా నిస్పృహలతోవుంటే నీ భర్తని ఎలా వుత్సాహ పరుస్తావు?సరే నీ  ట్రైనుకి అనౌన్స్మెంటు అయింది .నీకు ఎటు వంటి సహాయం కావాలన్నా నిస్సంకోచంగా ఫోను చెయ్యి.షాపు పెట్టే విషయ మ్మరోసారీ ఆ లోచించు.ఎందుకంటే అతను  ఎప్పటికి నీ కళ్ళ ముందు వుంటాడు అతనికి నీ సహాయం నీ కు అతని సహాయం అందుతుంది.ఏ పని చెయ్యాలన్నా ఒకరికొకరు తోడుగా వుంటారు.బై వుంటాను మరి."

రైలెక్కించి వై టింగ్కి రూముకి వెళ్ళాను.

రైలు కోసం నిరీక్షిస్తున్నంత సేపు నేస్తం చిన్న తనం గుర్తు కొచ్చింది

ఒక రోజు గురుమూర్తి గారు అదే రాణి వాళ్ళ నాన్నగారు సాయంత్ర సమయంలో మా యింటికి వచ్చారు, మా నాన్న గారు పేపరు చదువుకుంటున్నారు."నమస్కారం మాష్టారూ."తలెత్తి "నమస్కారం క్షమించండి మీరు." ఈ వూరికి కొత్తగా వచ్చాను ఇరిగేషన్ డిపార్ట్ల మెంటిలో సివిల్ ఇంజినీర్ గా.  చేస్తున్నాను." "రండి కూర్చోండి.". మేము వచ్చి వారం అయింది మాకు ఒక్క అమ్మయి పేరు స్వర్ణ లత యింట్లో అంతా రాణీ అనిపిలుచుకుంటాము.మా పక్కింటి వాళ్ళు మీ అమ్మాయి  వుంది తనకి తోడుగా వుంటుందని చెప్పారు."

"గౌరీ."

"వస్తున్నా నాన్నా." లంగా వాణీ వేసుకున్న పదహారేళ్ళ అమ్మాయి వచ్చింది.

ఈ అమ్మాయా? మా పిల్ల కి పదేళ్ళు అయిదో తరగతి చదువుతోంది."

"మా చిన్నమ్మాయి గురించి చెప్పి వుంటారు,సునీతని పంపించమ్మా"

" ఏమిటి నాన్నా "అంటూ వచ్చాను కొత్త వ్యక్తిని చూసి "నమస్తే" అన్నాను."

"నువ్వేనా సునీత ఏం చదువుతున్నావు?"

"ఏడవ క్లాసు "

మా అమ్మయి రాణి వీధిలోనే నాలుగిళ్ళ అవతల మేడవుంది అదే మాయిల్లు,ఒక్క సారి నాతో  మా యింటికి రామ్మా నీకు పరిచయం చేసి మళ్ళీ యింటి దగ్గర దింపేస్తాను." "అయ్యొ మీరు దిగబెట్టడమెందుకు వూరంతా చుట్టి వస్తుంది. వెళ్ళమ్మా అంకల్చెప్తున్నరు ఒక్కసారి కలుసుకో రోజూ ఆడుకుందికి వెళ్ళొచ్చు."

రోజు వెళ్ళాను పేరు రాణి యువ రాణిలా వుంది, పెళ్ళికో పేరంటానికో బయలు దేరినట్ట్లు,పట్టు లంగా జాకెట్టు మెడలో గొలుసులు వడ్డాణం చేతులకు  బంగారు గాజులు   పాపిడి బొట్టు "బాపురే!" అనుకున్నాను. వాళ్ళ నాన్నగారు మాయిద్దరి చేతులు కలిపి పరిచయం చేశారు.వాళ్ళ మామ్మగారికి అమ్మగారికి కూడా పరిచయం చేశారు.నమస్కారం పెట్టాను.

"సరే నేను యిప్పుడు వెళ్ళి రేపు వస్తాను."

 "అయ్యో అప్పుడే వైపోతావా?ఒక గంట ఆడుకుని వెళ్ళు".  అంది రాణి.కాదనలేక ఒక గంట కూర్చున్నాను.రాణిని గమనించినదేమిటంటె, ఆట అయిదు నిముషాలకి మించి ఆడదు,మొదల్లు పెట్టిన ఆట తను గెలవ వలసిందే .లేకుంటే అది కలిపేసి యి మరో ఆట మొదలు పెడుతుంది.  అమ్మా నాన్నగరితో రాణి మనస్తత్త్వం గురించి చెపితే "పోనీయమ్మా! ఒక్క పిల్ల కావడం నుంచి ఎక్కువ గారాబం చేసి అలా తయారై వుంటుంది. ఆ వారం లో నే ఒక్ రోజు నేను వెళ్ళగానే "సునీతా యీ రోజు నుంచి మనిద్దరం నేస్తం  కడదాం". "అదేమిటి నేనెప్పుడూ కట్టలేదు" "ఇప్పుడు కట్టి చూడు " నేస్తం కట్టిన వాళ్ళనిపేరు పెట్టి పిలవ కూడదు..నేస్తం అనే పిలవాలి.వాళ్ళతోనే యిష్టంగా వుండాలి.కూర్చో " అంటూ పళ్ళెంలో నీళ్ళు పోసి ఎదురెదురుగా కూర్చోమని చిటికెన వేళ్ళు పట్టుకుని పళ్ళెం చుట్టూ తిప్పుతూ నువ్వు నా నేస్తం నేను నీ నేస్తం అంటూ మూడు సార్లు తిప్పించింది.యీ రోజు నుంచి నేస్తం తోనే యిష్తంగా వుండాలి

."బాగుంది యిది కూడా ఒక ఆటలాగే వుంది.

వాళ్ళ నాయనమ్మగారు"అమ్మా!  నీతో నేస్తం కట్టాలని మూడురోజుల నుంచి ప్రయత్నం యీ రోజు ఎలాగైనా నేస్తం కట్టేయాలనుకుంది .మీ యిద్దరినీ భవగంతుడు చల్లగా చూడాలి."

అయోమయంగా చూశాను. మా నాన్న గారికి ట్రాన్స్ఫర్ల వుద్యోగంఒకటి రెండేళ్ళకి  మించి ఏవూర్లోని వుండరు. యిలా నేస్త్తాల్ని కడితే ఎంత మందవుతారో .

మరుసటి సంవత్సరమే నాన్న గారికి బదిలీ అయి వేరే వూరు వెళ్ళి పోయాం  అప్పుడు రాణి చాలా బాధ పడింది,నీలా  అడుకునే వాళ్ళు దొరకరు.అంటూ ఏడిచింది. తెలిసి తెలియని వయసులో అంతకన్నా మమతలు మమకారాలూ తెలియవు.మళ్ళీ యిన్నాళ్ళకి యీ విధంగ కలిపింది.

నా రైలు రావడం మర్నాడు గమ్యం చేరుకోవడం జరిగింది.

వారం తరువాత రాణి వద్ద నుంచి ఫోను వచ్చింది.దుకాణం పెట్టి చూసుకుందికి వాళ్ళాయన యిష్టపడ్డాడుట.యింకొకటి అడిగింది,వాళ్ళ అద్దె యింటికి బేంకు వాళ్ళే కొత్తవాళ్ళు వచ్చారుట భార్యా భర్తలిద్దరూ బేంకు వుద్యోగులే. వాళ్ళకి ఆరు నెలల బాబు వున్నాడుట ప్రొద్దుట పది నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు చూసుకో గలరా ఫ్రీగా కాదు నెలకు మూడు వేలిస్తామన్నారు ముందుగా మా వారిని అడిగాను బాగుంది నాకు వీలున్నప్పుడు నేను చూస్తాను అన్నారు.నీకు చెప్పి ప్రారంభిద్దామనుకుంటున్నాను నేస్తం. దుకాణం ప్రారంభించడానికి ఆరు నెలలు పట్టవచ్చు ,అందాకా చంటి వాడితో "శ్రీ గణేష్ "చేద్దామనుకుంటున్నాను.ఫొన్లో సంభాషణ విన్నాక నేస్తం మాటల్లో స్వరంలో ధైర్యం నమ్మకం తెలుస్తోంది.

"శుభస్య శీఘ్రం"అన్నాను. వారం వారం ఫోను చేసిజరుగుతున్న విషయాలు టూకీగా   చెప్పేది. ఆరు నెలలు గడిచాయి, "నేస్తం తీరికగా వున్నావా?" "1 ! చెప్పు చెప్పు ఏమిటి సంగతి? ?" "సంగతి పెద్దదే ! నే పెంచుతున్న బాబు ఏడాది వాడై తప్పటడుగులు వేస్తున్నాడు.మా యిద్దరికీ  బాబంటే చాలా ముద్దు,మా పెళ్ళయి పదేళ్ళైనా నాకు పిల్లలు కలుగ లేదు. నేనున్న పరిస్తితిలో అదీ ఒక మంచికే అనుకునేదాన్ని. నిన్ను కలిశాక నా ఆశలని ఆశయాలని వుత్సాహపరిచి ఊపిరి పోశావు.బాబుని పెంచితే నాలో మాతృత్త్వం మేలుకొని నా కడుపులో మరో ప్రాణి వూపిరి పోసుకుంటోంది.యిప్పుడు మూడో నెల  మా వారు చాలా ఉత్సాహంగా వున్నారు. ఇంకొకటి చెప్పనా? నాన్నగారి సామాన్లన్నీ చెక్ చేస్తుంటే వాలెట్లోంచి మూడు లక్షల సర్టిఫిచెట్లునా పేరున నామినీగా రాసిపెట్టారు. అవన్నీ కేష్ చేయించి ఫిక్సిడ్ వేయించాను..యిప్పుడు నాకు చాలా ధైర్యంగా వుంది నేస్తం. అందరికీ నీలాంటి ఒక్క నేస్తం వుంటే చాలు ."  అది విన్నాక నాగుండె సంతోషంతో నిండిపోయింది." "ఆల్ ద బెస్ట్ నేస్తం". 

No comments: